Saturday, April 20, 2024

కారు బోల్తా…ఇద్దరు మృతి – వీడియో తో

ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో కాశిరెడ్డి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో విజయవాడ వైపు నుంచి నెల్లూరు వైపు కనిగిరి మీదగా వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. కల్వర్టుని ఢీకొని పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాంపల్లికు చెందిన రామ కోటేశ్వరరావు, బ్రహ్మేశ్వరరావు, సత్య వాణి అన్నట్లుగా వారి వద్ద లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement