Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గడివేముల (మం) తిరుపాడు గ్రామ సమీపన మంగళవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు ఇలియాస్, నరసింహులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇలియాస్ నంద్యాల, నందికొట్కూరులో బేకరీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. నరసింహులు నంద్యాల గుడ్ షెడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి హమాలీ పనిచేస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement