Saturday, April 20, 2024

కారు ఢీకొని… ఇద్దరు భవానీ భక్తుల మృతి

కారు ఢీకొని… ఇద్ద‌రు భ‌వానీ భ‌క్తులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం పెనసం గ్రామానికి ఇద్దరు భవానీ భక్తులు సంతోష్‌, ఈశ్వరరావు వారం క్రితం స్వగ్రామం నుంచి విజయవాడకు పాదయాత్రగా బయల్దేరారు. తునివద్ద వీరిని కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement