Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 22 వేల మందికి కరోనా..

ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య మరోసారి 20 వేలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 22,164 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 1,05,494 నమూనాలను పరీక్షించారు. కరోనా మహమ్మారి కారణంగా నిన్న 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి. తాజాగా 8,832 మంది వైరస్‌ నుంచి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement