Saturday, April 20, 2024

టీవీ ఛాన‌ల్ పెట్ట‌బోతున్నా-విజ‌య‌సాయిరెడ్డి


టీవీఛాన‌ల్ పెట్ట‌బోతున్నాన‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడిన ఆయన… రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్, టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని… ఏ మీడియా రంగంలో అయితే రామోజీరావు ఉన్నారో… అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నానని చెప్పారు. మీ ఛానల్ ఎలా పనిచేస్తుందో … తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ అంటూ సవాల్ విసిరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement