Friday, March 29, 2024

Tweet: వైఎస్సార్ ప్ర‌దేశ్‌గా మార్చండి.. సీఎం జ‌గ‌న్‌పై సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ మ‌న్నం నాగేశ్వ‌ర‌రావు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సెటైర్ వేశారు. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించిన ఆయ‌న‌ ఏపీ సీఎం జ‌గ‌న్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చాల‌ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం” అంటూ ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఇంకో కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లిషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది అని ఆయ‌న జ‌గ‌న్‌పై సెటైర్ సంధించారు.

https://twitter.com/MNageswarRaoIPS/status/1529317497802878976
Advertisement

తాజా వార్తలు

Advertisement