Thursday, March 28, 2024

Breaking: టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. ఐసొలేష‌న్‌కు త‌ర‌లింపు

తిరుమ‌ల సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధ‌రాణ అయ్యింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డాం ద‌గ్గ‌రున్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వీరు శిక్షణ కోసం వ‌చ్చారు. కాగా, ఆ నలుగురు తిరుమల తిరుపతి దేవస్ఢానాల (టీటీడీ) సెక్యూరిటీ సిబ్బందిగా తెలుస్తోంది. కళాశాలలోకి అనుమతించే ముందు చేసిన వైద్య పరీక్షల్లో వారికి క‌రోనా అని తేలింది. దీంతో వారిని టీటీడీ అధికారులు ప్రత్యేక వాహనంలో వైద్యశాలకు తరలించారు.

ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ట్రైనింగ్ కాలేజీలోకి అనుమతించలేదని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సీఐ నిరంజన్ కుమార్ తెలిపారు. ఈ నలుగురు కూడా టీటీడీకి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement