Thursday, April 25, 2024

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి

తిరుపతి సిటీ: తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి టిటిడి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత శుక్రవారం ఉదయం పట్టుచీర, సారె సమర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర రెడ్డి తో కలిసి ఆమె అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గంగమ్మ ఆలయ ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement