Friday, March 29, 2024

సాంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టిటిడి

తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టిటిడి వెనక్కి తగ్గింది. సాంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో‌ దుష్ ప్రచారం చేయడం తగ్గదని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. సోమవారం స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు. టిటిడి పాలక మండలి లేని సమయంలో టిటిడి‌ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సాంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని అన్నారు.  అయితే సాంప్రదాయ భోజనంపై అధికారులతో చర్చించి సాంప్రదాయ భోజనంను ఇవాళ్టి నుండి నిలిపి వేస్తున్నాంమని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని, వాటిని భక్తులు ఎవ్వరూ నమ్మద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టిటిడిలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నాంమని తెలిపారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమంను ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టిటిడిలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యయంకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయబద్ధంగా గోవు నుండి పాల,నెయ్యి, వెన్నను సేకరచి స్వామి వారికి అందింస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఏ ఆహారంమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందుకనే సాంప్రదాయ భోజనంను నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వదర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండిః ఊరట: ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!

Advertisement

తాజా వార్తలు

Advertisement