Wednesday, April 24, 2024

రాములోరి కల్యాణానికి సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : టీ టీ డీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన ఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి ని ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు ముఖ్యమంత్రిని కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement