Thursday, April 25, 2024

ఎస్ ఐ శ్రావ‌ణి క‌న్నుమూత‌…

గుంటూరు: స‌హా కానిస్టేబుల్తో క‌ల‌సి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి( 35) మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతు తెల్లవారుజామున మరణించింది. గత శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలసి శ్రావణి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణీ 2018 బ్యాచ్ ఎస్ఐ. నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్‌లో తొలి పోస్టింగ్ వచ్చింది.అనంత‌రం చుండూరు పోలీసు స్టేషన్లలో ఎస్ఐ శ్రావణీ ఏడు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కాగా, మరోవైపు బలవన్మరణానికి యత్నించిన కానిస్టేబుల్ రవీంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement