Thursday, April 25, 2024

రైలు నుండి జారి ప్ర‌యాణీకుడి దుర్మరణం

క‌ర్నూలు – కోసిగి—కుప్పగల్లు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలునుండి జారిపడి కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా షాపూర్ తాలూకా హాయాల్ గ్రామనివాసి కేంచప్ప (45) మృతి చెందాడు. ఆదోని ఆర్పీఎఫ్ ఇంచార్జ్ గోపాల్ రైల్వే ఎస్సై సాయి లు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం .ఆదివారం రాత్రి యాదగిరినుండి బెంగళూర్ కు టికెట్ తీసుకొనిభార్య కూతురుతో కలసి రైలులో డోర్ మెట్ల దగ్గర కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. అయితే నిద్ర మత్తులో వుండి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు కేసునమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గుంతకల్లు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement