Thursday, April 18, 2024

Tragic Death – న‌వ వ‌రుడి ప్రాణం తీసిన నిద్ర ….

రాజాం – పెళ్లి బజాలతో సంతోషంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నిండింది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వరుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వివ‌రాల‌లోకి వెళితే విజయనగరం జిల్లా రాజంకి చెందిన సూర్యరావుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది.

బుధవారం అర్థ రాత్రి దాటిన త‌ర్వాత 00.55 గంటలకు పెళ్లికి ముహుర్తం ఖరారు చేశారు. పెళ్ళి వారి విడిదికి చేరుకున్న వరుడు రాత్రి ఇంట్లో ఉక్కపోతగా ఉందని భావించి మేడపై పడుకుందామని వెళ్లాడు. కొద్దిసేప‌టికే గాడ నిద్రలోకి జారుకున్నాడు. డాబాకు రెయిలింగ్ లేకపోవడంతో నిద్ర మత్తులో దొర్లిన సూర్యరావు మేడపై నుంచి కింద పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలబారిన పడిన సూర్యరావు ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement