Saturday, April 20, 2024

Breaking : విహారయాత్రలో విషాదం..బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి

వాజేడు ప్రభ న్యూస్ : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగత జలపాతం లో నీట మునిగి యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఉయ్యూరు గ్రామానికి చెందిన అనిల్ కృష్ణ (25) అనే యువకుడు హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.. ఆ కంపెనీలో పని చేస్తున్న వారు అందరూ ఫ్రెండ్స్ తో కలిసి ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగత జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. జలపాతలో జలకాలాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతం నీటిలో పడిపోవడంతో నీట మునిగిన యువకుడు విపరీతంగా నీళ్లు తాగడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అది గమనించిన తోటి స్నేహితులు హుటాహుటిన వాజేడు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. తోటి స్నేహితుడు తమతో కలిసి బొగత జలపాతం సందర్శనకు వచ్చి మృతి చెందడంతో మిత్రులందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బొగత జలపాతం లోయలో నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వాజేడు ఎస్సై హరీష్ అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement