Thursday, April 25, 2024

Breaking: కూలీ కుటుంబంలో విషాదం.. వంట చేస్తుండ‌గా పేలిన గ్యాస్ సిలెండ‌ర్‌..

శావల్యాపురం, (ప్రభ న్యూస్): గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రమాదపు శాత్తు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్రమైన గాయాల‌య్యాయి. ఈ ఘటన శావ‌ల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి జ‌రిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న జిర్ర ప్రసాద్ కుటుంబం కూలీ పనికి వెళ్లి వచ్చింది. సాయంత్రం వంట చేయటానికి ప్రసాద్ భార్య మేరీ గ్యాస్ స్టవ్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లోని కుటుంబ సభ్యులు జర్రి ప్రసాద్, భార్య మేరీ, కుమార్తె సుధారాణి, కుమారుడు సురేంద్రకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మంటలను ఆర్పీ 108 ద్వారా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథ‌మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement