Friday, April 19, 2024

Breaking: పండుగ పూట విషాదం.. పేరూరు డ్యామ్​లో మునిగి ముగ్గురి మృతి..

అనంతపురం, (ప్ర‌భ న్యూస్‌) : శ్రీ రామనవమి పండుగ తెచ్చిన సరదా.. ఆ ఇంట్లో విషాదం నింపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంత‌పురం జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లి ముగ్గురు నీట మునిగి చ‌నిపోయిన ఘ‌ట‌న ఇవ్వాల జ‌రిగింది. పేరూరు డామ్‌ లో చేపలు ప‌ట్టేందుకు వెళ్లిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇందులో తండ్రి, కూతురు, తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది.. తమ్ముడు గల్లంతు అయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. వీరిని యగువపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రథోత్సవం ఉందని వచ్చి సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లారని తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement