Saturday, April 20, 2024

విశాఖలో ఉన్నతాధికారులకు కరోనా!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా, జిల్లాలో ప్రతి రోజు రెండు వెలకుపై కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు సచివాలయం ఉద్యోగులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement