Thursday, April 25, 2024

తిరుపతి నుంచి ఢిల్లీకి జర్నీఈజీ.. స్పైస్ జెట్ సర్వీసు ప్రారంభం

తిరుపతి: దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి మ‌ధ్య నూత‌న విమాన స‌ర్వీసు ప్రారంభ‌మైంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ‌కు చెందిన ఈ స‌ర్వీసును కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ప్రారంభించారు. మొద‌టి స‌ర్వీసు ఇవాళ ఉద‌యం 9.50 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు తిరుప‌తికి చేరింది.

విమాన స‌ర్వీసు ప్రారంభం సంద‌ర్భంగా సింధియా మాట్లాడుతూ.. స్పైస్ జెట్ సంస్థ త‌న నూత‌న స‌ర్వీసు ద్వారా దేశ రాజ‌కీయ రాజ‌ధాని ఢిల్లీని ఆధ్యాత్మిక రాజ‌ధాని తిరుప‌తితో కలుపుతోందన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ఏటా 3.5 కోట్ల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నార‌ని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement