Monday, March 25, 2024

టిప్పర్ ని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు..

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి లో టిప్పర్ ని ఓ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఏలూరు కాల్వ వంతెన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయటంతో వెనుక నుంచి వస్తున్న తమిళనాడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గట్టిగా ఢి కొట్టింది. ట్రావెల్ బస్సులో 60 మంది ఉపాధి నిమిత్తం తమిళనాడు నుంచి తిరుపూర్ వెళ్తుండగా కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలవగా… ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కున్నాడు. దీంతో డ్రైవర్‌ ను క్యాబిన్ నుంచి బయటకు తీసిన పోలీసులు 108 వాహనం లో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement