Tuesday, April 16, 2024

AP: ముగ్గురు టెన్త్ విద్యార్థినీల మిస్సింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ముగ్గురు టెన్త్ విద్యార్థినీలు మిస్సింగ్ అయ్యారు. జిల్లాలోని రావూరులో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినీలు ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల నుంచి మిస్సింగ్ అయ్యారు. రాత్రి హాజరు సమయంలో విద్యార్థినీలు మిస్సింగ్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సయిన విద్యార్థినీలు జ్యోతి, నాగమణి, అంకిత ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థినీలు రావూరు, కలువాయి, పొదలకూరుకు చెందిన వారుగా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement