Thursday, March 28, 2024

రోడ్డుప్రమాదంలో.. సీఐ సహా ముగ్గురికి గాయాలు

రోడ్డుప్రమాదంలో సీఐ సహా ముగ్గురికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నాయుడు పేట మండలం పండ్లూరులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాయుడుపేట సీఐతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ రోడ్డుప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement