Friday, March 29, 2024

బైక్ ను ఢీకొన్న బ‌స్సు… ముగ్గురికి తీవ్ర‌గాయాలు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై సావర గూడెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ముగ్గురు వ్యక్తులతో వెళుతున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాల‌పాలైన వారిని విజయవాడ హాస్పిటల్ కు తరలించారు. బస్సు ఏలూరు నుండి విజయవాడ వెళుతుండగా ప్రమాదం జ‌రిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి చేర్చేందుకు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సును గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement