Saturday, April 20, 2024

అమరావతికి వెయ్యి కోట్లు వస్తాయా?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త న‌గ‌రాల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. 15వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త న‌ర‌గాల‌కు రూ.8 వేల కోట్ల రూపాయ‌ల నిధులు కేటాయించాల‌ని సిఫార‌సు చేసింది. కేంద్రం కూడా ఈ సిఫారసుల మేరకు న‌గ‌రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌కటించింది. అయితే, ఇప్పుడు ఆ 8 న‌గ‌రాల్లో అమ‌రావతి కూడా ఉంటుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

గతంలో సుమారు 217 చ‌.కిమీ విస్తీర్ణంలో అన్ని ర‌కాల హంగుల‌తో రూ.40 వేల కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సుమారు రూ.10 వేల కోట్ల రూపాయాలు ఖ‌ర్చుచేసి కొన్ని భవనాలు, రోడ్లు, ఇత‌ర మౌళిక వ‌స‌తులు ఏర్పాటు చేశారు. అయితే, గ‌త కొంత కాలంగా అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఈ 8 న‌గ‌రాల్లో అమ‌రావ‌తి కూడా ఉంటే మ‌ళ్లీ న‌గ‌ర నిర్మాణం వేగం పుంజుకుంటుంది. ఆర్థిక సంస్థ‌లు నిథులు వెచ్చించేందుకు ముందుకు వ‌స్తాయి. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు రోడ్లు, బిల్డింగ్‌లు, నీటి స‌ర‌ఫ‌రా, ప‌చ్చ‌ద‌నం వంటివి ఏర్పాటు చేయ‌డంతో త‌ప్ప‌కుండా అమ‌రావ‌తి ఆ 8 కొత్త న‌గ‌రాల జాబితాలో ఉండే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement