అమెరికాలోని బోస్టన్ లో నిర్వహించిన మహానాడును ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీ కోలుకోలేనంత నష్టపోయిందని అన్నారు. అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ధరలు భారీగా పెంచేశారని, వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు.
ఇక.. ఏపీలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు చెప్పారు. తనతో పాటు కేసుల్లో ఉన్న వారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని చెప్పారు. టీడీపీని అధికారంలోకి తేవడంలో ఎన్ఆర్ఐలూ కృషి చేయాలని కోరారు.