Thursday, April 25, 2024

తిరుపతిలో కరోనా ఆస్పత్రి నిర్వాకం..

కరోనా కు చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లను తమకు చూపించడం లేదని తిరుపతిలో పద్మావతి ఆసుపత్రి వద్ద కరోన పేషేంట్ బంధువుల ఆందోళన చేపట్టారు. కరోనా సోకిన వారికి సరైన వైద్యం అందకే మృతి చెందుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పేషెంట్లకు లోపలికి ఏదైనా పంపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూసిన తర్వాత మళ్లీ చూడటానికి కూడా లోపలికి పంపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్న రోగులు తమకు లోపల సరైన వైద్యం, తిండి అందలేదు అంటూ బంధువులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బంధువులు పద్మావతి ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement