తనను, లోకేష్ ను చంపేస్తారట అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ… బాబాయ్ ను చంపినట్టు తనను కూడా చంపేస్తారంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కళ్ళు తెరవాలని.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశమన్నారు. రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. నాకు కాదన్నారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చారు, కోడి కత్తి డ్రామా ఆడారని అన్నారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నాడని ఆరోపించారు. వైయస్ వివేకా కేసు సుప్రీంకోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకి వెళ్లడం జగన్ కి చెంపపెట్టు అన్నారు చంద్రబాబు. కొత్తగా వచ్చిన మంత్రికి అసలు డయాఫ్రం వాళ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో పోలవరాన్ని 72శాతం పూర్తి చేశామన్నారు. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారని ఆరోపించారు.