Thursday, April 25, 2024

పిడుగురాళ్ల ఘటనలో రాజ‌కీయ కోణం లేదన్న ఎస్పీ..

గుంటూరు క్రైo, (ప్రభా న్యూస్) : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘కొన్ని సామాజిక మాధ్యమాలలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన వీడియోలు చూశాను. ఆ ఘటన శివారెడ్డి, సైదాభి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పొలం తగాదాల కారణంగా జ‌రిగింది. ఈ ఘటన ఇవ్వాల జ‌రిగింది కాదు.. ఆదివారం నాడు జ‌రిగితే సమాచారం అందిన వెంటనే పిడుగురాళ్ల పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. బాధితులు తెలిపిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో సైదాభి పొలం వివాదంలోనే శివారెడ్డిపై దాడి చేయగా, శివారెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 20వ తేదీన పిడుగురాళ్ల పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. పొలం వివాదం, పాత కక్షల దృష్ట్యా ఈ ఘటన జరిగింది. దీన్ని రాజ‌కీయం చేసి వివాదాస్ప‌దం చేయ‌వ‌ద్దు. ఏదేమైనప్పటికి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement