Thursday, April 25, 2024

ఫోన్ ట్యాపింగ్ పై విచారణ అవసరం లేదు.. సజ్జల

ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రెస్ మీట్ పై సజ్జల స్పందిస్తూ… ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షంతో మాట్లాడుకున్న తర్వాత కోటంరెడ్డి మాటలకు విలువేం ఉంటుందని తెలిపారు. ఆడియోలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్ విషర్ గా చెప్పి ఉంటారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement