Thursday, March 28, 2024

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం

తిరుమ‌ల‌, (ప్ర‌భ న్యూస్‌): అందరి దైవం, పిలిస్తే ప‌లికే క‌లియుగ వేంక‌టేశ్వ‌రుడి స‌న్నిధిలో చోరీ క‌ల‌క‌లం చెల‌రేగింది. తిరుమ‌ల శ్రీ‌వారి ప‌ర‌కామ‌ణిలో కరెన్సీ లెక్కింపు మండపంలో నగదును చోరి జ‌రిగింది. డ‌బ్బులు దొంగిలించిన ఓ వ్యక్తి స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని ప‌ట్టుకెళ్లాడు. కొద్ది నెలలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇట్లా చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గొప్యంగా ఉంచి టీటీడీ విజిలెన్స్ బృందం ద‌ర్యాప్తు చేస్తోంది. కాగా, శ్రీ‌వారి పరకామణిలో చోరీ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స‌మాచారం. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement