Thursday, April 25, 2024

కిరాతకంగా భార్య హత్య.. ఆ తర్వాత భర్త ఆత్మహత్య

ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. భార్య నిర్మలను భర్త గంజి దావీదు కత్తితో కిరాతకంగా నరికి చంపాడు. గొంతు కోసి, రెండు చేతులు నరికి సైకోలా ప్రవర్తించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భర్త దావీదు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement