Thursday, April 18, 2024

అక్ర‌మం సంబంధం పెట్టుకుంద‌ని.. కన్నతల్లిని చంపి, పొలాల్లో పారేసిన కొడుకు

గోరంట్ల రూరల్‌, (శ్రీసత్యసాయి) ప్రభ న్యూస్‌ : అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నతల్లిని బండరాయితో మోది చంపిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలో జ‌రిగింది. గోరంట్ల మండల పరిధిలోని వానవోలు గ్రామానికి చెందిన సాకలి ఈశ్వరమ్మ హత్యకు గురైంది. మృతురాలు ఈశ్వరమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మ‌రో వ్యక్తితో ఆమే వివాహేత‌ర‌ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కన్న కొడుకుకు తెలియడంతో ప్రవర్తన మార్చుకోవాలని త‌ల్లిని చాలా సార్లు మంద‌లించాడు.

దీనికి ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో బుధవారం ఉదయం వారిద్దరి మధ్య గొడవ జ‌రిగింది. ఈ క్ర‌మంలో తల్లిని బండరాయితో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చ‌నిపోయింఇ. ఎవరికీ తెలియకుండా సమీపంలోని మొక్కజొన్న తోటలో డెడ్‌బాడీని పారేశాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌, సీఐ జయ నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జ‌రిపారు. దీంతో కన్నకొడుకొడుకే తల్లిని చంపినట్లు తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement