Tuesday, March 26, 2024

మామను హతమార్చిన అల్లుడు

వేమూరు : కూతుర్ని కాపురానికి పంపలేదని మామని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మండలంలోని చదలవాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం చదలవాడ గ్రామానికి చెందిన బొల్లిముంత కృష్ణమూర్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె అంమికమ్మ గుంటూరు సమీపంలోని పుత్తూరు గ్రామానికి చెందిన వనుకురి సాంబశివరావు అనే వ్యక్తికి 6 ఏళ్ల క్రితం ఇచ్చి పెళ్లి చేయగా వారికి ఇరువురు సంతానం ఉన్నారు. సాంబశివరావు తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతుండగా గత రెండేళ్ల క్రితం కృష్ణమూర్తి కుమార్తె కాపురం ఎగ్గొట్టి తండ్రి దగ్గరే ఉంటుంది. ఈ రెండేళ్లలో అప్పుడప్పుడు తాగి వచ్చి సాంబశివరావు భార్య, మామతో గొడవ పడేవాడు. అదేవిధంగా బుధవారం రాత్రి చదలవాడ గ్రామానికి వచ్చి భార్యను హతమార్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అడ్డు వెళ్ళిన మామను గొడ్డలితో గాయపరచి కత్తితో మెడపై బలవంతంగా కోసి హతమార్చాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని నిర్బంధించి పోలీసులకు అప్పగించగా ఈ మేరకు వేమూరు ఎస్ ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement