Tuesday, April 23, 2024

జూన్ 4న ఆర్‌ఐఎంసీ ప్రవేశ పరీక్ష… అర‌గంట ముందే ప‌రీక్ష సెంట‌ర్‌కు రావాలి

అమరావతి, ఆంధ్రప్రభ: డెహ్రడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరరీ కాలేజ్‌లో ఎనిమిదో తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జూన్‌ నాలుగో తేదీన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో అర్హులైన విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇప్పటికే పంపించామన్నారు. పరీక్షలు విజయవాడలోని బిషప్‌ అజరయ్య బాలికల జూనియర్‌ కళాశాలలో నాలుగో తేదీ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్‌, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు జనరల్‌ నాలెడ్జ్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇంగ్లిష్‌ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.

విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు ఏఎస్‌ఎగ్జామ్స్‌ఏపీపీఎస్సీఎట్‌దరేట్‌ఆఫ్‌జీమెయిల్‌.కామ్‌ కు ఈ మెయిల్‌ ద్వారా లేదా హెల్ప్‌ డెస్క్‌ 0866- 2527820, 0866- 2527821 నంబర్లకు పనిదినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement