Friday, April 19, 2024

ఆ పని చేస్తూ చిక్కారు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..

ఆమదాలవలస, (ప్రభ న్యూస్‌): పట్టణంలోని వెంగళరావు కాలనీలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను స్పెషల్‌ ఎన్ఫోర్సెమెంట్‌ బ్యూరో సిబ్బంది, ఆరుగురు సభ్యుల ముఠాను పట్టు-కుని అరెస్ట్‌ చేసారు. వారి నుంచి పెద్ద ఎత్తున కల్తీ మద్యం సీసాలను, కల్తీ మద్యం తయారీ కోసం వినియోగించే స్పిరిట్‌, ఖాళీ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కల్తీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారి పైడి కళ్యాణితో పాటు- ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన చందు, దుర్గాప్రసాద్‌లతో పాటు- మరో ముగ్గురుని అరెస్టు చేసినట్లు- పోలీసులు తెలిపారు.

లక్ష రూపాయిలు విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు- తెలిపారు. స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ కల్తీ మద్యం తయారీ దారుల నుంచి మద్యం నియోగదారులు అప్రమత్తంగా వుండాలని, ఎటు-వంటి అనుమానం వచ్చినా తమ దృష్టికి తేవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement