Wednesday, April 24, 2024

కుమారుడిని ఎయిర్‌పోర్టులో దింపి వ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌.. ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి..

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం… చిలకలూరిపేటకు చెందిన ఇద్దరు మృతి… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు… కుమారుడిని చెన్నై ఎయిర్ పోర్టులో అమెరికా ఫ్లైట్ ఎక్కించి వస్తుండగా జరిగిన ఘటన

చిలకలూరిపేట, (ప్రభ న్యూస్) : జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద చోటు చేసుకుంది సుబాబుల్ లోడు ట్రాక్టర్ వెనుక నుంచి కారు ఢీకొట్టింన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణం లోని పండరీపురం వాటర్ ట్యాంకులు ఎదురు సోదా వెంకట్రావు, కళావతి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు ప్రసన్న, భాస్కర్ లు ఉన్నారు. పెద్ద కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు భాస్కర్ ను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు కారులో బుధవారం రాత్రి వెళ్లారు. ఫ్లైట్ ఎక్కించి వెంకట్రావు, కళావతి, ప్రసన్నలు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. వీరిలో వెంకటరావు, ప్రసన్న లు మృతి చెందగా కళావతి, డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. పొద్దు పొద్దున్నే ఈ విషాద వార్త అందడంతో చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement