Thursday, April 25, 2024

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు అక్కడికే పరిమితం… సజ్జల

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు అక్కడికే పరిమితమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల ఏపీపై పలువురు తెలంగాణ మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రుల విమర్శలపై సజ్జల స్పందించారు. తమది అభివృద్ధి అజెండా అన్న ఆయన ఎవరి ట్రాప్ లో పడమని చెప్పారు. ఏపీకి, తెలగాణ రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. కానీ గతంలోనే ప్రజలు ఆయనకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని వెల్లడించారు. తనపై ఆరోపణలు చేసే పవన్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement