జగన్ ప్రభుత్వం ఎవ్వరికీ చుట్టం కాదని, నిజంగా తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ కొడాలి నాని పై వస్తున్న గుడివాడ క్యాసినో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. తమ ఎమ్మెల్యే అయినా కేసు పెట్టి సీఎం లోపల వేయమంటారని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉన్నా తప్పు చేస్తే జగన్ ఖచ్చితంగా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మేం ఎవ్వరికి భయపడబోమని నిష్పక్షపాతంగా వ్యవహారిస్తామని మంత్రి తెలిపారు. టీడీపీ వాళ్లు కొడాలి నాని పై కావాలనే బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..