Thursday, April 25, 2024

Breaking: ఆ ఎన్నిక చెల్ల‌దు, అంతా మీ ఇష్ట‌మైతే కుద‌ర‌దు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌

ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎన్నుకున్న విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌ప్పు ప‌ట్టింది. ప్ర‌జాస్వామ్యంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు, శాశ్వత పదవులు ఉండబోవని.. ఆ ఎన్నిక చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించింది. అంతా మీ ఇష్ట‌మున్న‌ట్టు చేస్తామంటే కుద‌ర‌ని ఈసీ సీరియ‌స్ అయ్యింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం రూల్స్​కి విరుద్ధమని తెలిపింది.

ఈ మేర‌కు వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌ద‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఉత్త‌ర్వులు పంపింది. ఇట్లా చేయడం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని పేర్కొంది ఈసీ. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement