Thursday, April 25, 2024

లోకేష్ పాద‌యాత్ర వ‌ల్ల టీడీపీకే న‌ష్టం.. మంత్రి కాకాణి

నారా లోకేష్‌ యువగళం పాద‌యాత్ర వ‌ల్ల టీడీపీకే న‌ష్ట‌మ‌ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. లోకేష్‌ది సమాజంలో ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌ చేసే పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. వయసు పైబడడంతో చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నాడని తెలిపారు. ఈ సారి కూడా చంద్రబాబుకు శృంగ భంగం తప్పదన్నారు. లోకేష్‌ పాదయాత్రలో ఏం మాట్లాడుతారోనని టీడీపీ నాయకులు టెన్షన్‌ పడుతున్నారని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విప్పడం అధికారంలోకి రాగానే గళం మూసుకుపోవడం చంద్రబాబు, లోకేష్‌కి ఆనవాయితీగా వస్తుందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్‌ గళం మూగబోయిందని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మళ్లీ గళం విప్పుతానంటున్నాడన్నారు. లోకేష్‌ గళం మళ్లీ మూసుకుపోవడమే తప్ప విరబూసేది కాదని కాకాని విమర్శించారు. లోకేష్‌ చేయాల్సింది పాదయాత్ర కాదు తన తండ్రి చేసిన మోసాలపై పాప పరిహార యాత్ర చేస్తే మంచిదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement