Thursday, April 18, 2024

ఏపీలో 1983 నాటి పరిస్థితులు.. ఎన్టీఆర్ సాక్షిగా టీడీపీని..

ప్రజలు ఎన్టీఆర్ ని దేవుడులా భావించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ నేతలు నివాళర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ తెలుగుజాతి నలుములల చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. రాజాకీయాల్లో వచ్చి నూతన ఓరవడి సృష్టించారని గుర్తుచేశారు. సినీ రంగంలో తెలుగు జాతికి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చారన్నారు. తెలుగు జాతికి సేవ చేయాలని సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజకీయంలోకి వచ్చారన్నారు. రాజకీయలోకి వచ్చిన తర్వాత  ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. నేడు పిల్లకాకి సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని.. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే అని గుర్తు చేశారు.

ఆనాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్‌దని అచ్చెన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఎదురించి అన్ని పార్టీలను ఎన్టీఆర్ ఎకం చేసిన ఘనత ఎన్టీఆర్ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేసులు బెదిరింపులుతో ప్రతిపక్షాన్ని అణిచి వేయ్యాలని చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత అణిచివేస్తే అంత పైకి లేగుస్తామన్నారు. రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ సాక్షిగా టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement