Thursday, April 25, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే అధికారం.. చంద్ర‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రానుంద‌ని ఆపార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌గిరిలో ఆయ‌న మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో జగన్‍కు షాక్ తగిలిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయన్నారు చంద్రబాబు. సీఎం జగన్ ఎంతో కసరత్తు చేసి.. చివరికి బొక్క బోర్లా పడ్డారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారని అన్నారు.

జగన్‍పై చాలామంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్నారు చంద్రబాబు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని అన్నారు. బయటకు రాని ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. నమ్మకంగా ఉండే నేతలే జగన్‍ను వీడి వెళ్తున్నారని.. నమ్ముకున్న వ్యక్తిని నట్టేట ముంచితే నాయకుడు కాదన్నారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా రెపరెపలాడిందన్నారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. సీఎం జ‌గ‌న్ పై వైసీపీ ఎమ్మెల్యేల‌కే న‌మ్మ‌కం లేద‌న్నారు. వ‌చ్చే టీడీపీ ప్ర‌భుత్వంలో పైర‌వీలు ఉండ‌వ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement