Thursday, April 18, 2024

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుః టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన


టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. విజయవాడ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. తన కుమార్తె శ్వేత కూడా పోటీ చేయబోదని, ఆమె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీ నుంచి బయటకు వెళ్లబోనని, టీడీపీతోనే కొనసాగుతానని నాని స్పష్టం చేశారు.

మరోవైపు నాని నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా తదితరులతో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండిః ఆ గాత్రం మధురం.. గాన గంధర్వుడికి ఘన నివాళి

Advertisement

తాజా వార్తలు

Advertisement