Friday, March 29, 2024

ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు!

కరోనా బాధితులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో పంపిణీ జరుగుతోంది. అయితే, చంద్రగిరిలో పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందు డబ్బాలపై దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మందు సృష్టికర్త ఆనందయ్య పేరు తప్ప ఆయన ఫొటో మాత్రం లేదు.

దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. అసలు ఆనందయ్య మందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైసీపీకి ఏమిటి సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా మందుకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తప్పులేదని, అయితే ఆనందయ్య మందును తామే సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి ఇందులో కనిపిస్తోందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. “అంతేలే… కోడికత్తిలో కోడి లేదు, గుండెపోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు!” అంటూ గోరంట్ల సెటైర్ వేశారు.

ఇది కూడా చదవండి: ఆనందయ్య మందు అందరూ వాడొచ్చు: చెవిరెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement