టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీలోకి వెళ్లను.. టీడీపీని వదులుకోను అంటూ గంటా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. వాటిని నేను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు గంటా. తాను పార్టీ మారుతున్నట్లు ఎప్పుడూ మాట్లడలేదని.. మారితే కచ్చితంగా చెబుతానని వెల్లడించారు. కాపు బహిరంగ సభను విజయ వంతం చేయాలని గంటా పిలుపు నిచ్చారు. రంగా ఒక కులానికో, లేదా మతానికో నాయకుడు కాదని.. అన్ని కులాలు, బలహీన వర్గాలకు బంధువు లాంటోడని కొనియాడారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని గంటా శ్రీనివాస్ హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement