Thursday, March 28, 2024

సీఐడీ పోలీసుల అదుపులో టీడీపీ మీడియా ఇన్‌చార్జి.. విచార‌ణ పేరుతో ఇంట్లోనుంచి..

గుంటూరు అర్బన్, (ప్రభ న్యూస్) : ఏపీ తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను ఇవ్వాల రాత్రి పోలీసులు తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న అత‌డిని సీఐడీ పోలీసులమ‌ని చెబుతూ దాదాపు 10 మంది దాకా వ‌చ్చి బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మధ్యమాల్లో సందేశాలపై విచారణ కోసం సీఐడీ పోలీసులు గుంటూరు అరండల్ పేట లోని నరేంద్ర స్వగృహం నుండి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ లీడ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు భారీగా సీఐడీ ఆఫీసుకు చేరుకున్నారు. న‌రేంద్ర‌ను వ‌దిలిపెట్టాల‌ని అధికారుల‌ను కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement