Tuesday, April 16, 2024

రైతుల బాధలు పట్టవా?: వైసీపీపై టీడీపీ నేతలు ఫైర్

కర్నూల్ జిల్లాలో తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఎండిన పత్తి, వేరుశెనగ పంట పొలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. మద్దికేర గ్రామంలో రైతులు రైతులు పడుతున్న కష్టాలను క్షేత్రస్థాయిలో వచ్చి చూడటానికి వచ్చిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి ఇన్చార్జ్ చేయి శ్యాంబాబు పొలాలు పర్యటించారు. మద్దికేరలో ఆత్మహత్య చేసుకున్న రైతు చంద్రశేఖర్ కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ పాఠశాలలో చేరుస్తామని తెలిపారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement