Wednesday, March 27, 2024

ఇదేం విడ్డూరం.. పక్షం రోజుల్లో 1.25 లక్షల ఉద్యోగాలిచ్చారా?

జగన్ సర్కార్ ఇంటికో ఉద్యోగమని మాట తప్పి కోటి మంది ఉపాధి పోగొట్టారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవి అంకెల గారడీలేనని విమర్శించారు. 15 రోజుల క్రితం 4.77లక్షల ఉద్యోగాలని ప్రకటించి.. ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలిచ్చామంటున్నారని చెప్పారు. పక్షం రోజుల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలిచ్చేశారా? అని ప్రశ్నించారు. 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. 10 వేలకు జాబ్ క్యాలండర్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా? మండిపడ్డారు. ఆర్టీసీలో పనిచేసే 50 వేల మందిని విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లు బోగస్ లెక్కలు చూపుతున్నారని తెలిపారు. కొవిడ్‌ సమయంలో 3 నెలల కోసం తీసుకున్న 26 వేల మందిని కూడా ఉద్యోగులుగా చూపడం హాస్యాస్పదం యనమల విమర్శించారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త… నేడే జాబ్ క్యాలెండర్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement