Tuesday, March 26, 2024

ఆ రహస్య ఒప్పందమేంటో ?: డీజీపీకి వర్ల రామయ్య బహిరంగ లేఖ

ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు చాలా చోట్ల చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందో? దాని వెనక చేసుకున్న రహస్య ఒప్పందమేంటో అందరికీ తెలియాలని, కాబట్టి వెంటనే దానిని బయటపెట్టాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీ నేతృత్వంలోని పోలీసు శాఖ పరిధి దాటి, చట్టాన్ని అతిక్రమిస్తూ అభాసుపాలవుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభావితం చేయడమే అందుకు కారణమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పిన జగన్.. ఇప్పుడు పోలీసుల తీరు సరైనదేనని చెప్పి ప్రజల్ని ఒప్పించగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అయినా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పోలీసులపై పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలని వర్ల రామయ్య ఆ లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement