Saturday, April 20, 2024

జగన్ రెండున్నరేళ్ల పాలనపై వర్ల రామయ్య లేఖ

ఏపీలో  సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు.

దారి మళ్లిన సబ్ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీల బాధలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అయ్యిందని వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రభుత్వ పరిపాలన అధికారి సీఎస్సే కాబట్టే.. లేఖ రాశామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని వర్ల రామయ్య లేఖలో ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement