Friday, March 15, 2024

వైసీపీ ఎమ్మెల్యే కాకాణిపై సోమిరెడ్డి సంచలన ఆరోపణ

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన దోపిడీ కోసం కాకాణి సొంత పార్టీకి చెందిన ఎంపీనే బలి చేయడానికి సిద్ధపడ్డాడని అన్నారు. మైనింగ్ అనుమతుల కోసం కాకాణి తన అనుచురుడితో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయించారని ఆరోపించారు. తద్వారా సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ రీతిలో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

అయితే, తన అక్రమ భాగోతంపై ఫిర్యాదులు రావడంతో కాకాణి ఆఖరికి సొంత పార్టీ ఎంపీ మాగుంటను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. కాకాణి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డిపైనే తప్పుడు కేసు పెట్టించారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఒకవేళ మాగుంటే తవ్వకాలకు దరఖాస్తు చేసుకుని ఉంటే పోలీసులు ఎందుకు విచారణ జరిపించలేదని సోమిరెడ్డి నిలదీశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాహనాలను పట్టుకున్న పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు మాగుంట పేరును ఏ-2గా చేర్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement